సెన్సేషన్ కోసం వార్తలు రాయకండని హెచ్చరించిన తమన్నా!

  • March 7, 2018 / 03:36 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలోని టాప్ హీరోయిన్స్ లో తమన్నా ఒకరు. బాహుబలి సినిమా హిట్ తో ఎన్నో అవకాశాలు వస్తాయనుకున్న తమన్నాకి నిరాశే మిగిలింది. అందుకే తమన్నా ఫ్రస్టేషన్ తో ఉంది. చీటికీ మాటికీ చిరాకు పడుతోంది. ముఖ్యంగా మీడియా మీద అయితే.. వీలు దొరికినప్పుడల్లా విరుచుకుపడుతోంది. తాజాగా ట్విట్టర్ వేదికపై సంచలనం కోసం అవాస్తవాలు రాసేవారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘మీరు ఒక వార్తను పబ్లిష్ చేసే ముందు ఎందుకు కసరత్తు చేయరని నాకు ప్రతిసారి అనిపిస్తుంది.

మీరు ఒక వార్తను సెన్సేషన్ చేయడానికి ముందు ఆర్టిస్టును ప్రశ్నించరా? ఆ సమాచారం కరెక్టో కాదో చెక్ చేసుకోరా? నెక్ట్స్ టైమ్ నా గురించి ఏదైనా పబ్లిష్ చేయడానికి ముందు రెస్పాన్సిబుల్‌గా ఉండండి.. నా దృష్టికి తీసుకురండి. నన్ను ఇంటర్వ్యూస్‌తో మిస్‌కోట్ చెయ్యొద్దు. నా ఇంటర్వ్యూలో విషయాన్ని దాటి టీఆర్పీ కోసం బయటకు వెళ్లొద్దు. అటువంటి జర్నలిజాన్ని ఆపేయండి’’ అంటూ తమన్నా ఆగ్రహం వ్యక్తం చేసింది. తనపై ఇంకెప్పుడూ తప్పుగా వార్తలు ప్రచురించవద్దంటూ హెచ్చరించింది. తమన్నా ట్వీట్ గురించి కోలీవుడ్, టాలీవుడ్ వర్గాలవారు చర్చించుకుంటున్నారు. ఆమె గురించి ఎవరు తప్పుగా రాశారు? ఏ విషయం ఆమెను ఆగ్రహానికి గురిచేసిందోనని ఆరా తీస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus