హౌస్ మేట్స్ మాత్రమే కాదు తమన్నా ఎలిమినేషన్ తో ప్రేక్షకులు కూడా హ్యాపీ

  • August 12, 2019 / 02:00 PM IST

‘కింగ్’ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్3’ సక్సెస్ ఫుల్ గా మూడు వారాలు పూర్తి చేసుకుంది. ఆదివారం ఎపిసోడ్లో నాగార్జున బిగ్ బాస్ షోను ఆద్యంతం రక్తి కట్టించాడు. ‘అంకితం నీకే అంకితం అనే టాస్కు’ నిర్వహించి.. నచ్చిన పాటని ఇంటి సభ్యులు తమకి నచ్చిన తోటి హౌస్మేట్ కు అంకితమివ్వాలన్న మాట. ఇక ‘మన్మధుడు2’ కమెడియన్ వెన్నెల కిషోర్ బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చి బయట బిగ్ బాస్ ఇంటి సభ్యుల గురించి ఏం అనుకుంటున్నారో వారికి చెప్పాడు. ఈ క్రమంలో తమన్నా సింహాద్రి ఎలిమినేట్ అయినట్టు తెలిపాడు నాగార్జున. ఈ సమయంలో తమన్నా సింహాద్రిని ఎవరికి ఏం చెప్పాలనుకుంటున్నావో.. ఒక నిమిషంలో చెప్పమని చెబుతాడు నాగార్జున.

దీంతో తమన్నా సింహాద్రి… వరుణ్ ఇతరుల మాటలు ఎక్కువగా వింటాడని అందుకే నచ్చలేదని చెప్పింది. రోహిణిని.. ‘బిగ్ బాస్’ హౌస్ కు ఇలాంటి క్యాండిడేట్స్ వేస్ట్ అంటూ కామెంట్ చేసింది. రవికృష్ణ మబ్బులా ఉండిపోవడం చూడలేకపోయానని… ‘నువ్వు బయట హీరో ‘బిగ్ బాస్’ హౌస్ నుండి కూడా హీరోగా రావాలని కోరుకుంటున్నాని చెప్పుకొచ్చింది. రాహుల్ సిప్లిగంజ్ కు ఆడపిల్లలకు గౌరవం ఇచ్చి మాట్లాడాలని సూచించింది తమన్నా. పునర్నవి ఇతరుల మాటలు విని తప్పుదోవ పడుతుందని …. ఇక మహేష్ విట్టాని తమ్ముడని చెప్పింది తమన్నా. వితిక ఎప్పుడూ కారాలు మిరియాలు నూరుతుందని… రాహుల్ మాటలు విని తప్పుదోవలోకి వెళుతుందని తెలిపింది. బాబా భాస్కర్ తన తల్లి, తండ్రి, గురువులాంటి వాడని చెప్పుకొచ్చింది. అలీ రేజా… ‘బిగ్ బాస్’ ఇంట్లో విలన్ అయిపోతున్నాడని, ఆడవాళ్ళను టార్గెట్ చేయొద్దని మగవాళ్ళను టార్గెట్ చేసి మగాడని నిరూపించుకోవాలని ఘాటుగా కామెంట్స్ చేసింది. ఏమైనా ఎలిమినేట్ అయ్యాక కూడా నోరు పారేసుకుంది తమన్నా. ఇక ప్రేక్షకులైతే తమన్నా ఎలిమినేట్ అవ్వడంతో చాలా అందపడుతున్నామని కామెంట్స్ పెడుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus