మనసులోని కోరికను బయటపెట్టిన తమన్నా.!

  • May 11, 2018 / 01:21 PM IST

ప్రస్తుతం జయేంద్ర దర్శకత్వంలో మిల్కీ బ్యూటీ తమన్నా కళ్యాణ్ రామ్ కి జోడీగా  “నా నువ్వే”  చిత్రాన్ని చేస్తోంది. అంతేకాకుండా బాలీవుడ్ లో కంగనా రనౌత్ చేసిన క్వీన్  తెలుగు వెర్షన్ లో క్వీన్ గా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది. తాజాగా ఓ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఈమె తన మసులోని మాటను బయటపెట్టారు. మీరు బయోపిక్ మూవీ చేయాలనుకుంటే.. ఎవరిగా నటించడానికి ఇష్టపడుతారు? అని ప్రశించగా.. “దేశంలో చాలామంది మహిళలు నాకు స్ఫూర్తిగా నిలిచారు. సానియా మీర్జా, శ్రీదేవి బయోపిక్ లో నటించాలని ఆశగా ఉంది” అని అన్నారు.

ముఖ్యంగా తాను శ్రీదేవి సినిమాలను చూస్తూ పెరిగానని చెప్పారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు టాప్ హీరోయిన్ గా కొనసాగిన శ్రీదేవి …. తన నటనతో కోట్లాది మంది మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు. తెలుగు వారందరూ అతిలోక సుందరిగా పిలుచుకునే ఈమె కొన్ని రోజుల క్రితం లోకం విడిచి వెళ్లారు. దీంతో ఆమె బయోపిక్ తీయాలని చాలామంది ఉత్సాహపడుతున్నారు.  హిందీ దర్శకుడు హన్సల్‌ మెహ్తా శ్రీదేవి జీవిత చరిత్రను సినిమాగా రూపొందించడానికి రెడీ అవుతున్నారు. మరి ఇంతగా ఆశపడుతున్న తమన్నాని  హన్సల్‌ శ్రీదేవి పాత్రకు తీసుకుంటారో లేదో త్వరలోనే తెలియనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus