స్టార్ హీరోను అరెస్ట్ చేయమని ఆదేశించిన హైకోర్ట్

  • May 7, 2019 / 09:48 PM IST

గతంలో సినీనటుల సంఘానికి శరత్‌కుమార్‌ అధ్యక్షునిగా.. రాధారవి కార్యదర్శిగా ఉన్నారు. వారి హయంలో కాంచీపురం జిల్లా వెంకటమంగళంలో ఉన్న సినీనటుల సంఘానికి చెందిన స్థలాన్ని అక్రమంగా విక్రయించారని 2017లో ఓ వ్యక్తి పిటిషన్‌ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్‌ను విచారించిన మద్రాస్‌ హైకోర్టు.. 3 నెలల్లో స్థల విక్రయం కేసును తేల్చి శరత్‌కుమార్‌, రవిలను అరెస్ట్‌ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం నడిగర్‌ సంఘానికి హీరో విశాల్‌ సెక్రటరీగా ఉన్నాడు. తప్పుడు పత్రాలు సృష్టించి, డాక్యుమెంట్లలో మార్పులు

 చేసి యూనియన్‌కు చెందిన ఆస్తిని అక్రమంగా విక్రయించారని విశాల్‌ కూడా ఆరోపించాడు. కొన్నినెలల క్రితమే ఈ కేసు కోర్టులో విచారణకు వచ్చింది. తన వాదనలకు బలం చేకూరేలా ఆధారాలు ఉంటే వాటితో కేసు నమోదు చేయొచ్చని కోర్టు విశాల్‌కు సూచించింది. ఈ కేసుపై వాదనలు విన్న కోర్టు అవసరమైతే వారిద్దరి అరెస్ట్‌ చేసి వారిని విచారించాలని కాంచీపురం క్రైమ్‌ బ్రాంచ్‌కు మ‌ద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus