అప్పుడు కూతురు.. ఇప్పుడు చెల్లెలు !!

  • November 30, 2016 / 02:07 PM IST

సినీ తారలకు సినిమాలో మాత్రమే కాదు బయటప్రపంచంలో కూడా వరసలుండవని ఎప్పట్నుంచో సినీ పరిశ్రమకు దూరంగా ఉండేవారు అనుకుంటూనే ఉన్నారు. అందుకు తగ్గట్లే.. మన నటీమణులు ఒక సినిమాలో అన్నయ్య పాత్ర పోషించిన నటుడితో తదుపరి చిత్రంలో కథానాయికగా జతకట్టేవారు. ప్రొఫెషన్ పరంగా వారు చేసేది తప్పు కాకపోయినప్పటికీ చూసేవారికి మాత్రం అది చాలా తేడాగా అనిపించేది. సావిత్రి-ఎన్టీయార్ లు అలా ఒక సినిమాలో అన్నాచెల్లుళ్లుగా, మరో చిత్రంలో భార్యాభర్తలుగా నటించినప్పుడు వారిపై ఉన్న అభిమానం కారణంగా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కానీ.. అదే తరహాలో ఇప్పుడున్న హీరోహీరోయిన్లు ఎవరైనా అలా నటిస్తే మాత్రం ఆన్ లైన్ లో అభాసుపాలవ్వడం ఖాయం. అందుకే హీరోహీరోయిన్లు కాకపోయినా.. ఇద్దరు హీరోయిన్లు మాత్రం అలా వరసలు మార్చుకొనేందుకు సన్నద్ధమవుతున్నారు.

అసలు విషయం ఏంటంటే.. వెంకటేష్ హీరోగా “నేను శైలజ” ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కనున్న “ఆడవాళ్ళు మీకు జోహార్లు” (వర్కింగ్ టైటిల్) చిత్రంలో నిత్యామీనన్ కథానాయికగా నటిస్తుండగా.. అదే సినిమాలో “ఐస్ క్రీమ్” బ్యూటీ కూడా ఓ ముఖ్యపాత్ర పోషిస్తుందట. అయితే.. ఇదివరకూ వీరిద్దరు కలిసి “మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు” అనే సినిమాలో తల్లీకూతుళ్లుగా నటించారు. ఇప్పుడు తాజా సినిమాలో అక్కాచెల్లెళ్లుగా నటించనున్నారు. మరి తల్లీకూతుళ్లుగా వీరి పెర్ఫార్మెన్స్ చూసి ఆదరించిన ప్రేక్షకులు అక్కాచెల్లెళ్లుగా ఏమేరకు ఆదరిస్తారో చూడాలి!

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus