అభిమానులను ఆశ్చర్య పరిచే పెద్ద సప్రైజ్ ఉంది : సుకుమార్

  • March 15, 2018 / 01:19 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సౌండ్ ఇంజినీర్ చిట్టిబాబుగా నటించిన చిత్రం రంగస్థలం. సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ టీజర్లు, పాటలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఎంత సక్కగున్నావే,  రంగా రంగా రంగస్థలాన,  రంగమ్మా మంగమ్మా, అనే పాటలు ఇది వరకు విడుదలై ఎక్కువ వ్యూస్ అందుకోగా నిన్న ఆ గట్టునుంటావా నాగన్న, జిగేల్ రాణి.. పాటలు రిలీజ్ అయి హుషారుని పెంచాయి. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఈనెల18 న వైజాక్ లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుకుమార్ ఆసక్తికర విషయం చెప్పారు.

చంద్రబోస్ పాటలు రాసిన తర్వాత దేవీ ట్యూన్ కట్టారని.. అవన్నీ అద్భుతంగా వచ్చాయని వివరించారు. ఇప్పటి వరకు సినిమాలోని ఐదు పాటలను మాత్రమే రిలీజ్ చేశామని  మరో సప్రైజ్ ఉందని వెల్లడించారు. ఆల్బంలోని మరో  పాటను నేరుగా వెండితెరపైనే చూడాలని అన్నారు. సమంత హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతి బాబు, అనసూయ కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ మూవీ మార్చి 30 న థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus