అజ్ఞాత‌వాసి సినిమాలో కోతకు గురైన సీన్లు కలుపుతారా ?

  • January 10, 2018 / 10:49 AM IST

పవన్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన అజ్ఞాతవాసి ఈ రోజు ప్ర‌పంచ‌వ్యాప్తంగా 2700 థియేట‌ర్ల‌లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. పవన్ ఫ్యాన్స్ బాగుందని అంటుంటే.. మరికొంతమంది అంచనాలను అందుకోలేకపోయిందని చెబుతున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో కొన్ని సీన్లకు కట్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే రెండు గంట‌ల 40 నిమిషాలు ఉండడంతో ఆ సీన్లు తొలిగించారని తెలిసింది. అయితే వీటిని వారం తర్వాత సినిమాకు క‌లుపుదామ‌ని ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ భావిస్తున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు.

అయితే అభిమానుల వ‌చ్చే స్పంద‌న‌ బట్టి కలపాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకోనున్నారు. హారిక అండ్ హాసిని బ్యానర్లో రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్యానుయేల్ నటించారు. వీరి ముగ్గురి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఫైట్స్ మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. ప్రీమియర్ షో ద్వారానే బాహుబలి బిగినింగ్ రికార్డులను బద్దలు కొట్టిన అజ్ఞాతవాసి కలక్షన్స్ పరంగా మరిన్ని రికార్డులను సృష్టించనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus