పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..!

  • January 1, 2019 / 01:37 PM IST

2019 జనవరి 1 న్యూ ఇయర్ సందర్బంగా… స్టార్ హీరోలు నటిస్తున్న బడా చిత్రాల అప్డేట్స్ ను ప్రకటించారు. ఇందులో భాగంగా.. అల్లుఅర్జున్ -త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న చిత్రానికి సంబంధించి అధికార ప్రకటన ఇచ్చేసారు. అల్లు అరవింద్, రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్ 19వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కబోతుంది.

ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ‘జెర్సీ’ చిత్రం నుండీ ఒక లుక్ ను విడుదల చేసారు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ద శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. ‘మళ్ళీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నాని క్రికెటర్ గా.. అర్జున్ పాత్రలో కనిపించనున్నాడు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ లో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 25వ చిత్రం ‘మహర్షి’ నుండి కూడా ఒక పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. జేమ్స్ బాండ్ లుక్ లో వచ్చిన ఈ లుక్ కి మహేష్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఫిదా అయిపోతున్నారు. ఈ చిత్రం కూడా సమ్మర్ మరియు ఉగాది కానుకగా ఏప్రిల్ 5 న విడుదల కాబోతుంది. ఇలా ఈ ముగ్గురు హీరోలు న్యూ ఇయర్ సర్ప్రైజ్ ల తో అలరించడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus