రైతుగా ట్రాక్టర్ నడుపుతూ.. భారీ ఫైట్ చేస్తున్న మహేష్ బాబు

  • January 19, 2019 / 12:44 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ‘మహర్షి’ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా గ్రామీణ నేపథ్యంలో సాగే కొన్ని సన్నివేశాలని… హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన విలేజ్ సెట్లో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ పొల్లాచ్చిలో జరుగుతుంది.

మహేష్ బాబు మోడరన్ రైతుగా.. ట్రాక్టర్ తో పొలం దున్నుతూ వుండే సన్నివేశంతో పాటు, 60 ట్రాక్టర్లతో .. 30 నాగళ్లతో అక్కడ ఒక భారీ ఫైట్ సీన్ ను ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సీన్స్… సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని ముఖ్యంగా అభిమానులు థియేటర్లలో విజిల్స్ వేస్తూ రచ్చ చేయడం ఖాయమని.. ఫిలింనగర్ విశ్లేషకులు చెప్తున్నారు. తన స్నేహితుడి కోసం ఇండియా వచ్చిన హీరో .. వ్యవసాయంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం కథలో ప్రధానాంశంగా ఉంటుందట. ఈ చిత్రంలో అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. మహేష్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. దిల్ రాజు,అశ్వినీ దత్, ప్రసాద్ వి పొట్లూరి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. జగపతి బాబు, సాయి కుమార్ తదితరులు ముఖ్య పత్రాలు పోషిస్తుండడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus