‘47డేస్’ మూవీ కి ఓవర్సీస్ లో మంచి డిమాండ్

సత్యదేవ్, పూజా ఝవేరీ, రోషిణి ప్రకాష్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం 47డేస్. ద మిస్టరీ అన్ ఫోల్డ్స్ అనేది ఉపశీర్షిక. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుపుకుంటోంది. ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో తెరకెక్కిన ” 47డేస్” ఓవర్సీస్ రైట్స్ మంచి రేట్ కు అమ్ముడయ్యాయి.. త్రిశూల్ ఫిలిమ్స్ సంస్థ ఈ చిత్రాన్ని ఓవర్సీస్ లో విడుదల చేయబోతోంది. ఈ మధ్య వస్తోన్న థ్రిల్లర్ మూవీస్ మంచి వసూళ్లు సాధిస్తున్నాయి.

అందుకే ఈ మూవీ అవుట్ పుట్ తెలిసిన ‘‘త్రిశూల్ సినిమాస్’’ ఈ సినిమా హక్కులు దక్కించుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంగావస్తోన్న ఈ చిత్రానికి రఘు కుంచె సంగీతం అందిస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా పూరీ జగన్నాథ్ చేతులమీదుగా రిలీజ్ చేసిన ‘‘క్యా కరూన్’’ అనే పాటకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. టైటిల్ కార్డ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దబ్బార శశిభూషణ్ నాయుడు, రఘు కుంచె, శ్రీధర్ మక్కువ, విజయ్ శంకర్ డొంకాడ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.త్వరలోనే థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసి వేసవిలో సినిమాను విడుదల చేస్తామని దర్శకనిర్మాతలు చెబుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus