అలనాటి హీరోయిన్స్ కి కీలక పాత్రలు ఇచ్చిన త్రివిక్రమ్.!

  • April 5, 2018 / 01:15 PM IST

జై లవ కుశ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం తారక్ ఇరవై కిలోల బరువు తగ్గారు. షూటింగ్ సమయానికి ఇంకొంచెం బరువు తగ్గనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో డీజే పాప పూజా హెగ్డే ఎన్టీఆర్ తో కలసి హంగామా చేయనుంది. సంగీత దర్శకుడిగా ఎస్ఎస్ థమన్ ఫిక్స్ అయ్యారు. కొత్త కొత్త స్వరాలతో యువతని ఉర్రూతలూగిస్తున్న థమన్ ఎన్టీఆర్ కోసం అదిరిపోయే ట్యూన్స్ ఇవ్వనున్నారు.  అలాగే  కీలక పాత్రల్లో  నటింపచేసేందుకు అలనాటి హీరోయిన్స్ లయ, మీనాలను అడిగారు. త్రివిక్రమ్ గత చిత్రాలైన “అత్తారింటికి దారేదీ”, అజ్ఞాతవాసిలో నదియా, ఖుష్బూలను గొప్పగా చూపించారు. అందుకే అలనాటి హీరోయిన్స్ త్రివిక్రమ్ మూవీలో అవకాశమొస్తే వదులుకోకూడదని భావిస్తున్నారు.

లయ, మీనాలు కూడా ఈ సినిమాలో నటించడానికి ఉత్సాహంగా ఉన్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది. ఇక వచ్చే నెల సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో సునీల్  సెక్యూరిటి ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిసింది. ఇదివరకటి కమెడియన్ సునీల్ ని ఇందులో చూస్తారని చిత్ర బృందం తెలిపింది.  నాన్నకు ప్రేమతో సినిమాలో జగ్గూభాయ్ ఎన్టీఆర్ కి విలన్ గా నటించారు. వీరిద్దరూ పోటీ పడి నటించి  ఆ సినిమాని విజయవంతం చేశారు. అందుకే ఇందులోనూ ఎన్టీఆర్ కి విలన్ గా జగపతిబాబుని తీసుకోవాలని ఆలోచిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus