వాళ్ళ హస్జెంబ్డ్స్ తో యాక్ట్ చేయడం వల్లే వాళ్ళు క్లోజ్ అయ్యారు

  • January 4, 2019 / 12:02 PM IST

ఇదివరకూ హీరోల భార్యలు అంటే కేవలం ఇంటికే పరిమితం అయ్యేవారు. ఒకవేళ ఇంట్లో కంట్రోల్ అంతా వాళ్ళ చేతిలోనే ఉన్నప్పటికీ పొరపాటున కూడా బయటకి వచ్చేవాళ్లు కాదు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ ల సతీమణులు పబ్లిక్ ఈవెంట్స్ లో కనబడిన సందర్భాలు వేళ్ళతో లెక్కపెట్టవచ్చు. కానీ.. మారుతున్న కాలంతోపాటు పద్ధతులు కూడా మారుతూ వచ్చాయి. ఇప్పుడు హీరోలకంటే వాళ్ళ సతీమణుల హవానే ఎక్కువైంది. సోషల్ మీడియాలో వాళ్ళ హల్ చల్ మామూలుగా ఉండదు. ఇందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన & మహేష్ బాబు వైఫ్ నమ్రత. ఈ ఇద్దరికీ సోషల్ మీడియాలో భీభత్సమైన ఫాలోయింగ్ ఉంటుంది. వారి భర్తలకంటే ఎక్కువగా వాళ్ళే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వారి అభిమానుల ఆదరణను చూరగొన్నారు.

వీళ్ళు సోషల్ మీడియాతో ఆగిపోలేదండోయ్.. తమ భర్తలతో కలిసి నటించే హీరోయిన్లతోనూ రిలేషన్స్ మెయింటైన్ చేయడం మొదలెట్టారు. ప్రస్తుతం ఉపాసన, నమ్రతలు బాలీవుడ్ ముద్దుగుమ్మ కీయారాతో క్లోజ్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారట. ఈ విషయాన్ని కీయారా ఇటీవల మీడియాతో పంచుకొంది. మహేష్, చరణ్ కంటే ఎక్కువగా ఉపాసన & నమ్రతలే కీయారాతో కాంటాక్ట్ లో ఉంటారట. ఎప్పుడు హైద్రాబాద్ వచ్చినా ఈ ఇద్దరితోనే చిల్ అవుతానని చెప్పుకొచ్చింది కీయారా.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus