భారీ ధరకు అమ్ముడు పోయిన రంగస్థలం నైజాం థియేటర్ రైట్స్!

  • December 13, 2017 / 12:06 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  డైరక్టర్ సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న “రంగస్థలం” మూవీపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. రీసెంట్ గా రిలీజ్ అయిన చెర్రీ లుక్ సినిమాపై అంచనాలను పెంచింది. అలాగే బయటికి వచ్చిన కొన్ని ఫొటోస్ లలో సమంత పల్లెటూరి అమ్మాయిలా ఆకట్టుకుంది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తి అయింది. మరో రెండు పాటల షూటింగ్ మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే ఈ మూవీకి ఇప్పుడే బిజినెస్ మొదలు అయింది. నైజాం థియేటర్ రైట్స్ ని యువీ క్రియేషన్స్ వారు సొంతం చేసుకోవడం విశేషం. ఏకంగా 18 కోట్లు చెల్లించి రైట్స్ దక్కించుకున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు.

దీని బట్టే ఈ సినిమాపై ఉన్న క్రేజ్ అర్ధమవుతోంది. రాక్ స్టార్ దేవీ ప్రసాద్ పాతిక సంవత్సరాలు వెనక్కి వెళ్లి ఆనాటి పాటల ట్యూన్స్ కి మ్యాచ్ అయ్యే హుషారైన ట్యూన్స్ ఇచ్చినట్లు సమాచారం. జగపతి బాబు, అది పినిశెట్టి, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నా ఈ చిత్రం మార్చి 30 న థియేటర్లోకి రానుంది. ధృవ సినిమా తర్వాత రామ్ చరణ్ చేస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. చరణ్ ఈ సినిమా తర్వాత బోయపాటి దర్శకత్వంలో సినిమా మొదలు పెట్టనున్నారు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus