న్యూయార్క్ లో లొకేషన్ వేటలో పడిన వంశీ, వినోద్!

  • October 13, 2017 / 06:49 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ కెరీర్ లో ఓ మైలు రాయిగా చెప్పుకునే 25 వ మూవీ పనులు ఊపందుకున్నాయి. ఊపిరితో అభినందనలు అందుకున్న వంశీ పడి పల్లి ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఎక్కువభాగం అమెరికాలో జరగనుంది. అందుకే వంశీ ఈ సినిమా డీఓపీ పీఎస్ వినోద్, ప్రొడక్షన్ డిజైనర్ సునీల్ బాబు తో కలిసి న్యూ యార్క్ కి వెళ్లారు. అక్కడ అందమైన లొకేషన్స్ ని సెలక్ట్ చేయనున్నారు.

ఈ విషయాన్నీ వంశీ ట్విట్టర్ లో వెల్లడించారు. ఫోటో కూడా పోస్ట్ చేశారు. ప్రస్తుతం మహేష్ బాబు ఫ్యామిలీ తో కలిసి విదేశీ టూర్ లో ఉన్నారు. రేపు హైదరాబాద్ కి రానున్నారు. ఎల్లుండి నుంచి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భరత్ అనే నేను సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. శ్రీమంతుడు కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus