దిల్ రాజు, మహేష్ ల మధ్య ఇబ్బంది పడుతున్న వంశీ పైడిపల్లి

  • October 27, 2018 / 01:22 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి అనే సినిమా చేస్తున్నారు. అశ్వినీదత్, దిల్ రాజు, పీవీపీ కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ వేగంగా సాగుతోంది. డీజే బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్ర మొదటి షెడ్యూల్ డెహ్రాడూన్ లోని కాలేజ్ లో జరిగింది. అదే ఉత్సాహంతో చిత్ర బృందం రెండో షెడ్యూల్ కి సిద్ధమవుతోంది. త్వరలో అమెరికాకి చిత్ర బృందం వెళ్లనుంది.మహేష్ కి స్నేహితుడిగా అల్లరి నరేష్ నటిస్తున్న మూవీ గురించి ఆసక్తికర సంగతి బయటికి వచ్చింది. మహర్షి సినిమాలో ముందుగా అనుకున్న ఫైట్స్ కంటే మరో రెండు ఫైట్లు పెడదామనీ .. హిందీ డబ్బింగ్ రైట్స్ పెద్ద మొత్తానికి పోవాలంటే యాక్షన్ ఎక్కువగా ఉండాలని దిల్ రాజు వంశీ పైడిపల్లికి చెప్పారట.

ఆ విషయాన్ని మహేష్ కి చెబితే … కథ ప్రకారమే ఫైట్లు ఉండాలి గానీ … అనవసరంగా కొత్త ఫైట్లు జోడించవద్దని గట్టిగా చెప్పారంట. ఒక వైపున ఫైట్లు పెంచమని దిల్ రాజు .. మరో వైపున వద్దని మహేశ్ బాబు చెబుతుండటంతో ఏమి చేయాలో తెలియక వంశీ పైడిపల్లి టెన్షన్ పడుతున్నట్టు ఫిల్మ్ నగర్ వాసులు చెప్పారు. చివరికి ఏ నిర్ణయం తీసుకుంటారో అనేది.. త్వరలోనే తెలియనుంది. భరత్ అనే నేను వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మహేష్ చేస్తున్న ఈ సినిమా ఉగాది కానుకగా ఏప్రిల్ 5 న థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus