మిస్టర్ షూటింగ్ లో గాయపడ్డ మెగా ప్రిన్స్

  • September 30, 2016 / 02:16 PM IST

మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి ప్రమాదం జరిగింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో అయన కథానాయకుడిగా నటిస్తున్న ‘మిస్టర్’ చిత్రం కొన్నిరోజులుగా ఊటీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ రోజు భారీ యాక్షన్ సీక్వెన్స్ లో వరుణ్  స్టంట్ చేస్తుండగా గాయాల పాలయినట్లు తెలిసింది. వెంటనే అక్కడికి దగ్గరలోని హాస్పిటల్ కి వరుణ్ తేజ్ ని తీసుకువెళ్లగా, వైద్యులు చికిత్సచేసి ప్రమాదం ఏమి లేదని, రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారట.

లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై ‘ఠాగూర్‌’ మధు, నల్లమలుపు శ్రీనివాస్‌ నిర్మిస్తున్న ఈ మూవీలో లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వరుణ్ కి ప్రమాదం జరగడంతో చిత్ర బృందం షూటింగ్ ని ఆపేసింది. అయితే మెగా ప్రిన్స్ రెస్ట్ తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా సినిమా కూడా చేస్తున్నారు. మిస్టర్ షెడ్యూల్ పోస్ట్ పోన్ అయితే దాని ప్రభావం ఫిదా పై పడుతుంది. డేట్స్ గజిబిజి అయిపోతాయి. కాబట్టి కొంచెం కోలుకోగానే మిస్టర్ షూటింగ్ లో పాల్గొంటానని వరుణ్, దర్శకుడు శ్రీనువైట్లకు చెప్పారని చిత్ర యూనిట్ వెల్లడించింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus