సంకల్ప్ రెడ్డితోనే వరుణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్

  • April 17, 2017 / 10:46 AM IST

భారత్ పాక్ యుద్ధ నేపథ్యంలో సాగే సంఘటనను కమర్షియల్ సినిమాగా మలిచి యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి అందరితో శెభాష్ అనిపించుకున్నారు. రానా హీరోగా తెరకెక్కించిన ఘాజీ సినిమా సూపర్ హిట్ అయి సంకల్ప్ రెడ్డికి మంచి గుర్తింపును తీసుకొచ్చింది. దీంతో అతను చేయబోయే తర్వాతి సినిమాపై ఆసక్తి నెలకొంది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే కథతో వచ్చిన కంచె లో అద్భుతంగా నటించిన వరుణ్ తేజ్ ని తన రెండో సినిమాకి హీరోగా తీసుకున్నట్లు తెలిసింది. ఈ స్టోరీ కూడా చరిత్ర పుటల్లోంచి వచ్చినది కావడంతో మెగా ప్రిన్స్ వెంటనే ఒప్పుకున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

శ్రీను వైట్ల దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన మిస్టర్ గత శుక్రవారం రిలీజ్ అయి మిశ్రమస్పందన సొంతం చేసుకుంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్  ఫిదా మూవీని చేస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ఫిల్మ్ పూర్తి అయిన వెంటనే సంకల్ప రెడ్డి డైరక్షన్లో సినిమాను ప్రారంభించనున్నారు. హీరో, డైరక్టర్ యుద్ధ నేపథ్య కథతో హిట్ అందుకున్నవారు కావడంతో, ఈ కాంబో మూవీపై అంచనాలు మొదలయ్యాయి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus