వరుణ్ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నా.. రొమాంటిక్ సాంగ్స్ సున్నా

  • February 28, 2018 / 12:44 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమ అనేక ప్రయోగాత్మక కథలకు వేదికవుతోంది. మూడు ఫైట్లు, ఆరు పాటలు.. అందులో ఓ మసాలా సాంగ్ అనే గిరి నుంచి బయటికి వచ్చి విజయాలను అందుకుంటోంది. కొత్త దర్శకులు వినూత్న కాన్సెప్ట్ తో సినిమాలను తెరకెక్కించి తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి సబ్ మెరియన్ లో జరిగే సంఘటనలను ప్లాట్ గా తీసుకొని ఇండియా పాక్ యుద్ధాన్ని వెండితెరపై చూపించి అభినందనలు అందుకున్నారు. అతని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఘాజీ తెలుగుతో పాటు నాలుగు భాషల్లో విజయాన్ని సాధించింది. ఈ దర్శకుడు ఇప్పుడు నింగి అవతల జరిగే కథను సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించనున్నారు. అంతరిక్షంలో ఈ స్టోరీ సాగనుంది. ఇందులో వ్యోమగామి (రోదసి యాత్రికుడు) గా వరుణ్ తేజ్ నటించనున్నారు.

జీరోగ్రావిటీలో తేలియాడేట్టుగా నటించేందుకు అతను ప్రతేకంగా విదేశాల్లో శిక్షణ తీసుకుంటున్నారు. అయితే ఇందులో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నట్టు టాక్. ఇప్పటివరకు వరుణ్ తేజ్ సినిమాలో ఒకే హీరోయిన్ ఉంటుంది. ఇందులో ఇద్దరు అనగానే… రొమాన్స్, డ్రీమ్ సాంగ్స్ ఉంటుందని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే అసలు ఈ చిత్రంలో డ్రీమ్ సాంగ్స్ ఉండవట. కథను నడిపించే మాంటేజ్ సాంగ్స్ మాత్రమే ఉంటాయని సమాచారం. ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ త్వరలో తెలియనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus