ముంబై మ్యూజియంలో వెంకటేష్ మైనపు ప్రతిమ

  • June 4, 2018 / 10:06 AM IST

వివాదాలకు దూరంగా ఉండే హీరో వెంకటేష్. విమర్శలు కూడా ఆయన దరిదాపుల్లోకి రావు. ఈగోలను పక్కన పెట్టి, స్టార్ డమ్ ని థియటర్లో పెట్టి.. మంచి మనసున్న నటుడిగా అందరి మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. అతనికి తెలుగు ప్రజల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. ఆ విషయం తాజాగా మరోసారి నిరూపితమైంది. ఏకంకా ఓ అభిమాని వెంకటేష్ మైనపు ప్రతిమని ఏర్పాటుచేశారు. ముంబైలోని సునీల్స్ వాక్స్ మ్యూజియంలో వెంకీ నిలువెత్తు ప్రతిమని ప్రతిష్టించారు. ఈ విషయం తెలిసి వెంకీ అభిమానులు సంతోషిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫోటోలను షేర్ చేస్తున్నారు.

అయితే కొంతమంది నెటిజన్లు వెంకీ ప్రతిమని చూసి విమర్శలు చేస్తున్నారు. ప్రతిమ వెంకీ రూపంలో లేదని, తమిళ నటుడు కార్తీ రూపంలో ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఏదిఏమైనా ముంబై వాసులను వెంకటేష్ ఆకట్టుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తెలుగులో హిట్ సాధించిన యమలీల సినిమాని హిందీలో వెంకీ రీమేక్ చేశారు. ఒక్క సినిమా చేసినప్పటికీ అక్కడి ప్రజలు గుండెల్లో స్థానం సంపాదించుకోవడం విశేషం. వెంకటేష్ గురు సినిమా తర్వాత ఎక్కువగా గ్యాప్ తీసుకున్నప్పటికీ నాలుగు సినిమాలని లైన్లో పెట్టారు. త్వరలోనే ఆ సినిమాల వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus