తన సినీ ప్రయాణం గురించి షాకింగ్ విషయాల్ని తెలిపిన విద్యాబాలన్

  • August 13, 2019 / 02:38 PM IST

బాలీవుడ్ లో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రెస్స్ అంటే విద్యాబాలన్‌ పేరే చెప్పాలి. ‘డర్టీ పిక్చర్‌’ చిత్రంతో ఓవర్‌నైట్‌ స్టార్‌గా మారిపోయింది విద్యాబాలన్. ‘సిల్క్ స్మిత’ జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో.. విద్యాబాలన్ చాలా బోల్డ్ గా నటించింది. అయితే ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం అంత ఈజీగా అయితే జరగలేదట.. ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇవ్వకముందు ఆమె ఎన్నో కష్టాలు పడుతూ వచ్చింది. దాదాపు 3 ఏళ్ళ వరకూ ఆఫీసులు చుట్టూ తెగ తిరిగిందట. ఈ విషయాల్ని స్వయంగా విద్య బాలన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. విద్య బాలీవుడ్‌తో పాటు పలు దక్షిణాది భాషా చిత్రాల్లో కూడా నటించింది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా వస్తున్న ‘మిషన్‌ మంగళ్‌’ చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రంలో విద్యా బాలన్ తో పాటు తాప్సీ, సోనాక్షి సిన్హా, నిత్యా మేనన్‌, కృతి కుల్హారీ… ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కాబోతుంది.

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విద్య మాట్లాడుతూ.. “మాది సినీ నేపథ్యం ఉన్న కుటుంబం కాకపోవడంతో సినిమాల్లోకి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డాను. ఎలా రావాలో కూడా తెలిసేది కాదు. నా కుటుంబం కూడా ఈ విషయంలో చాలా ఇబ్బంది పడింది. కానీ వారి మద్దతు, ప్రోత్సాహం వల్ల ఎలాగో అడుగుపెట్టగలిగాను. మొదటిసారి టీవీ షోలో చేశాను. తర్వాత అది ఆగిపోయింది. ఆ సమయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాను. కానీ, సినిమాల్లోకి రావాలన్న కలను మాత్రం వదిలిపెట్టలేదు. మూడేళ్ళపాటు కొన్ని కార్యాలయాల చుట్టూ తిరిగాను. ఎక్కడికి వెళ్ళినా నన్ను రిజెక్ట్ చేస్తూ వచ్చేవారు. ఓ సారయితే మూడు రోజుల పాటు నిద్రకూడా పట్టలేదు. ఏడుస్తూనే ఉన్నాను. కానీ తర్వాత నాకు నేను విశ్వాసం కూడగట్టుకుని మళ్ళీ ప్రయత్నించేదాన్ని. భవిష్యత్తు మీద ఆశ ఉంది కాబట్టే నా కలను వదులుకోలేదు’ అంటూ చెప్పుకొచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus