వరుస బయోపిక్ ఆఫర్లు దక్కించుకుంటుంది

  • May 9, 2019 / 05:03 PM IST

ప్రముఖ బాలీవుడ్ నటి విద్యా బాలన్ ప్రస్తుతం వరుస బయోపిక్స్ లో నటించడానికి రెడీ అవుతుంది. ఇప్పటికే బాలకృష్ణతో కలిసి ఎన్టీఆర్ బయోపిక్ లో నటించింది. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రంలో బసవతారకం పాత్ర పోషించింది. నిజ జీవితంలో కూడా బసవతారకం గారు ఇలానే ఉండేవారేమో అనేలా ఆ పాత్రలో జీవించేసింది. ఈ చిత్రం పై ఎన్నో ట్రోల్స్ వచ్చినా… సినిమా డిజాస్టర్ అయినా విద్యా బాలన్ పాత్రకు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక దశలో ఈ చిత్రానికి ‘బసవతారకం’ టైటిల్ పెడితేనే బాగుణ్ణు అని ప్రేక్షకులు కామెంట్లు చేశారు.

ఇక తాజాగా విద్యా బలం మరో బయోపిక్ లో నటించడానికి రెడీ అయ్యిందట. హ్యూమన్ కంప్యూటర్ , ప్రముఖ మ్యాథమేటీషియన్ శంకుతల దేవి జీవితం ఆధారంగా ఓ చిత్రం రూపొందనుంది. ఈచిత్రంలో శంకుతల దేవి పాత్రలో విద్యా బాలన్ నటించడానికి ఓకే చెప్పిందట. లేడీ డైరెక్టర్ అను మీనన్ తెరకెక్కిస్తున్న ఈచిత్రాన్ని విక్రమ్ మల్హోత్రా నిర్మించనున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలకానుందని సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus