సూపర్ సక్సెస్ ఫుల్ సీక్వెల్లో శ్రద్ధాశ్రీనాథ్

  • May 13, 2019 / 07:23 PM IST

ఇటీవల వచ్చిన నాని ‘జెర్సీ’ చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాని నటనతో పాటూ హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ నటన కూడా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ‘జెర్సీ’ చిత్రం విజయంలో శ్రద్దా శ్రీనాథ్ పాత్ర కూడా చాలా కీలక పాత్ర పోషించింది. దీంతో పాటూ తమిళంలో ఆమె నటించిన ‘కె 13’ చిత్రం కూడా మంచి విజయం సాధించింది. ఇలా వరుస విజయాలు ఆమెను వరించడంతో పాటూ ఈమెను వెతుక్కుంటూ మంచి ఆఫర్లు వస్తున్నాయి. కోలీవుడ్ హీరో విశాల్ చేయాలనుకుంటున్న కొత్త చిత్రంలో శ్రద్దాకి అవకాశం వచ్చినట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం.

గతంలో విశాల్ చేసిన సైబర్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఇరుంబు తిరై’కు సీక్వెల్ గా ఓ చిత్రం రూపొందనుంది. తెలుగులో ‘ఇరుంబు తిరై’ ను ‘అభిమన్యుడు’ గా డబ్ చేయగా ఇక్కడ కూడా సూపర్ హిట్టయ్యింది. అయితే ‘ఇరుంబు తిరై’ ను పిఎస్. మిత్రన్ డైరెక్ట్ చేయగా సీక్వెల్ ను మాత్రం ఆనంద్ అనే కొత్త కుర్రాడు డైరెక్ట్ చేస్తున్నాడట. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సీక్వెల్ ఒకేసారి విడుదల కానుందని తెలుస్తుంది. ఇక టాలీవుడ్లో కూడా శ్రద్ధకు వరుస అవకాశాలు వస్తున్నాయి. అలా అని ఆమె కంగారు పడకుండా ఆచి తూచి సినిమాల్ని ఎంచుకుంటుందట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus