చిరంజీవి బోయపాటికి మధ్య చిచ్చుకి కారణం ఏంటి?

  • November 15, 2018 / 11:32 AM IST

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్, కైరా అద్వానీ జంటగా దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో డివివి దానయ్య నిర్మిస్తున్న సినిమా ‘వినయ విధేయ రామ’. ఇప్పటికే రిలీజ్ అయినా ఈ సినిమా టీజర్ తో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇక అన్ని పూర్తి చేసుకొని ఈ సినిమా సంక్రాంతి బరిలోకి రానుంది. బోయపాటి అంటేనే మాస్ మరి రామ్ చరణ్ తేజ్ ని ఏ రేంజులో స్క్రీన్ మీద చూపిస్తాడో అని మెగా అభిమానుల్లో ఆసక్తి ఎక్కువగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా డిసెంబర్ లో స్టార్ట్ చేయనున్నారు.

ఈ సినిమాకి సంబంధించి ఒక విషయం ఇప్పుడు బయటకి వచ్చింది, ఈ సినిమా నిడివి 3 గంటల 10 నిముషాలు వచ్చిందట, ఈ విషయం తెలిసిన మెగాస్టార్ చిరంజీవి సినిమా నిడివి ఇంత ఉండటం ఏంటని అడిగి తెలుసుకోగా కథ రీత్యా అంత ఉందని బోయపాటి ఒప్పించగా, దానికి చిరంజీవి ఒక మాస్ ఎంటర్టైనర్ ఇంత నిడివి ఉండటం కరెక్ట్ కాదని సినిమా ఫైనల్ ఎడిట్ లో 30 నిముషాలు కచ్చితంగా తగ్గించాలంటూ చెప్పారంటా. దీంతో డైరెక్టర్ బోయపాటి 30 నిముషాలు తీసేయాలంటే ఏ సీన్స్ కట్ చేయాలనే డైలమాలో పడినట్లుగా సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus