ఇంతకీ అంతలా ఎందుకు ఏడ్చారో చెప్పండి ప్లీజ్!

  • August 11, 2018 / 01:29 PM IST

“శ్రీనివాస కళ్యాణం” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో హీరో నితిన్, హీరోయిన్ రాశీఖన్నా మొదలుకొని నిర్మాత దిల్ రాజు వరకూ అందరూ “సినిమా పూర్తయ్యేసరికి అందరం ఏడ్చేశాం, రేపు థియేటర్లో కూడా ప్రేక్షకులు కంటతడి పెట్టడం ఖాయం” అంటూ ప్రగల్భాలు పలికారు. అందరూ అలా చెప్పడంతో ఆడియన్స్ అందరికీ సినిమా మీద విశేషమైన అంచనాలు నమోదయ్యాయి. అందులోనూ దిల్ రాజు బ్యానర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో మొదటిరోజు థియేటర్ కి కుటుంబ సమేతంగా వెళ్ళిపోయారు జనాలందరూ.

కట్ చేస్తే.. సినిమా 40కి మించిన వాళ్ళకి మినహా పెద్దగా ఎవరికీ నచ్చలేదు. ఎక్కువగా వినిపించిన కామెంట్ ఏంటంటే.. “ఈ సినిమా ఏదో పెళ్లి సీడీలా ఉంది తప్పితే సినిమా చూసినట్లు మాత్రం లేదు”. 70% జనాలు అలాగే ఫీలయ్యారు. ఓవర్సీస్ ఆడియన్స్ మాత్రం “ఇంతకీ యూనిట్ సభ్యులందరూ సినిమా చూస్తూ ఎందుకు ఎడ్చారో చెప్పండి?” అని అడుగుతున్నారు. పాపం సినిమా చూసినవాళ్ళ ఫ్రస్టేషన్ ఈ ప్రశ్నతో అర్ధమవుతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus