రైటర్ ని డైరక్టర్ గా పరిచయం చేయబోతున్న ఎన్టీఆర్ బయోపిక్

  • April 28, 2018 / 03:32 PM IST

మహానటుడు నందమూరి తారక రామారావు ఎంతోమందిని డైరక్టర్స్ గా పరిచయం చేశారు. ప్రతిభని ప్రోత్సహించారు. ఆయన జీవితంపై తెరకెక్కబోతున్న మూవీకూడా రైటర్ ని డైరక్టర్ గా పరిచయం చేయబోతోంది. వివరాల్లోకి వెళితే.. కొన్ని రోజుల క్రితం ఎన్టీఆర్ బయోపిక్ ని తేజ వైభవంగా ప్రారంభించారు. అంతే గ్రాండ్ గా వెండితెరపై మహానటుడుని ఆవిష్కరించాలని అనుకున్నారు. కానీ ఈ ప్రాజక్ట్ నుంచి ఆయన తప్పుకున్నారు. మరి దర్శకత్వ బాధ్యతలు ఎవరు తీసుకుంటారనేది? ఫిలిం నగర్లో జోరుగా చర్చ సాగుతోంది. నందమూరి బాలకృష్ణ నటిస్తూ, నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక మూవీ డైరక్ట్ చేసే అవకాశం కె రాఘవేంద్ర రావు, కృష్ణవంశీ, క్రిష్ ల వద్దకు వెళ్లిందని, వారు తిరస్కరించినట్లు సమాచారం. దాంతో ఆలోచనలో పడ్డ బాలయ్యకి సాయి మాధవ్ బుర్రా కనిపించారు.

అతను తన గౌతమి పుత్ర శాతకర్ణికి రచయితగా పనిచేశారు. అలాగే ఎన్టీఆర్ బయోపిక్ కి రచయితగా కష్టపడ్డారు. కథ అది నుంచి అంతం వరకు బాగా తెలుసు. సో అతనికే దర్శకత్వ బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. త్వరలో ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సినిమాలో ఇందిరాగాంధీ రోల్ ని నదియా, కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు పాత్రలో పరేష్ రావెల్, చంద్రబాబునాయుడు పాత్రలో రానా కనిపించనున్నారు. మరికొంతమంది బాలీవుడ్ స్టార్స్ కూడా ఈ ప్రాజక్ట్ లో భాగం కానున్నారు. కీరవాణి సంగీతమందిస్తున్న ఈ మూవీ దసరాకి రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus