‘ఏడు చేపల కథ’ 2 డేస్ కలెక్షన్స్ ?

  • November 9, 2019 / 04:03 PM IST

‘చరిత సినిమా ఆర్ట్స్’ బ్యానర్ పై జి.వి.ఎన్ శేఖర్ రెడ్డి నిర్మించిన తాజా చిత్రం ‘ఏడు చేపల కథ’. ఎస్.జె.చైతన్య డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో అభిషేక్, భాను శ్రీ ప్రధాన పాత్రలు పోషించారు. పూర్తిగా అడల్ట్ కంటెంట్ తో రూపొందిన ఈ చిత్రం నవంబర్ 7న విడుదలయ్యింది. టీజర్, ట్రైలర్ లు చూసి ఓ రేంజ్లో టెంప్ట్ అయిన ప్రేక్షకులు ఈ సినిమాకి ఎగబడి వెళ్ళారు. అయితే టెంప్ట్ అయ్యి వెళ్ళినంతగా సినిమాలో ఏమీ లేదంటూ మళ్ళీ వాళ్ళే పబ్లిక్ టాక్ లో చెప్పుకొచ్చారు. ఇక రెండు రోజులకే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయిపోవడం విశేషం.

ఈ చిత్రానికి 1.4 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం తెలుగురాష్ట్రాల్లోనే 1.48 కోట్ల షేర్ ను రాబట్టింది. దీంతో బయ్యర్స్ అంతా సేఫ్ అయిపోయారు. మొదటి రోజు సినిమా టాక్ తెలిసినప్పటికీ రెండో రోజు కూడా అదే స్థాయిలో కలెక్షన్లు రావడమంటే ప్రేక్షకులు ఏ రేంజ్లో టెంప్ట్ అయ్యారనేది ఈ కలెక్షన్ల బట్టి చెప్పొచ్చు. సినిమాలో ఏమాత్రం క్వాలిటీ లేకుండా కేవలం నాలుగు బూతు సీన్లతో టీజర్లు విడుదల చేసి క్యాష్ చేసుకోవడం చాలా చీప్ ట్రిక్స్ అంటూ కొంతమంది సినీ విశ్లేషకులు కామెంట్స్ చేస్తుండడం విశేషం. ఇక ఫుల్ రన్ లో ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి..!

తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus