జగన్ రోల్ లేకుండా కంప్లీట్ కానున్న యాత్ర

  • October 6, 2018 / 05:53 AM IST

మహా నేత, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి బయోపిక్ యాత్ర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మహి వి రాఘవ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న బయోపిక్ లో వైఎస్సార్‌ పాత్రను మలయాళ స్టార్‌ మమ్ముట్టి పోషిస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్సార్ మీద ఉన్న అభిమానంతో ఈ సినిమా చేయడానికి ఆయన ఒప్పుకున్నారు. అలాగే వైఎస్సార్ తనయుడు జగన్ రోల్ కూడా ఈ సినిమాలో పెట్టాలని గతంలో అనుకున్నారు. అనేకమంది నటీనటులను పరిశీలించారు కూడా. తమిళ హీరోలు సూర్య, కార్తీల పేర్లు వినిపించాయి. విజయ్ దేవరకొండ పేరుకూడా పరిశీలించారు.

కానీ తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో జగన్ పాత్ర ఉండదని తెలిసింది. కేవలం వై ఎస్ బాల్యం నుంచి ముఖ్యమంత్రి అవ్వడంతో కథ ముగుస్తుందని, అతనిపైనే ఫోకస్ పెట్టడం వల్ల జగన్ పాత్ర అవసరం లేదని దర్శకుడు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ విశేషంగా ఆకట్టుకుంది. సినిమా కూడా వైఎస్ అభిమానులకు బాగా నచ్చుతుందని చిత్ర బృందం ధీమాగా ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus