దిల్ రాజు సినిమా కోసం పాతిక మంది హీరోలా..!

  • November 7, 2016 / 10:24 AM IST

సక్సెస్ ఫుల్ చిత్రాల నిర్మాతగానే కాదు.. మల్టీ స్టారర్ ట్రెండ్ ని ఈ తరానికి పరిచయం చేసిన నిర్మాతగానూ ‘దిల్’ రాజుకి పేరుంది. మల్టీ స్టారర్ సినిమాని ప్రేక్షకులముందుంచినంత మాత్రాన ఒకే సినిమాలో పాతికమంది హీరోలా అని అనుకుంటున్నారేమో..! వీరంతా ఒకే తెరపైకి వస్తోంది సినిమా కోసం కాదు. ఓ ఆడియో వేడుక కోసం. వివరాల్లోకెళితే..దిల్ రాజు నిర్మాతగా ప్రయాణం మొదలెట్టి పదమూడేళ్లు దాటింది. ఈ పదమూడేళ్లలో 24 సినిమాలను నిర్మించారు దిల్ రాజు. శర్వానంద్ హీరోగా తెరకెక్కుతోన్న ‘శతమానం భవతి’ దిల్ రాజు నిర్మిస్తోన్న 25వ చిత్రం.

సీనియర్ నిర్మాతలే ఆచితూచి అడుగులేస్తున్న ఈ సమయంలో అతి తక్కువ కాలంలోనే ఇన్ని సినిమాలు చేసిన ఏకైక నిర్మాత దిల్ రాజు. అదీ విజయాల పరంపరను కొనసాగిస్తూ.. ఈ సందర్బంగా 25వ సినిమా అయినా ‘శతమానం భవతి’ ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేశాడట. డిసెంబర్ 18న జరుగనున్న ఈ వేడుక కోసం దిల్ రాజు తన ఇరవై నాలుగు సినిమాల హీరోలను ఒకే వేదికపై తీసుకొస్తున్నట్టు సమాచారం. ఇదే నిజమైతే శర్వా సినిమాకి మంచి ప్రచారం లభించినట్టే. పలు పెద్ద సినిమాలకు రచన సహకారం అందించి, అప్పట్లో ‘దొంగలబండి’ సినిమా తీసిన వేగేశ్న సతీష్ దర్శకుడిగా చేస్తున్న రెండో ప్రయత్నమిది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ స్వరకర్త.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus