అభిషేక్ చేతికి ‘కబాలి’ చిత్ర తెలుగు హక్కులు.. !

  • May 14, 2016 / 08:40 AM IST

పా రంజిత్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘కబాలి’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేయగా.. ఈ ట్రైలర్ యూట్యూబ్ లో సంచలనాలు సృష్టించింది. ఈ ట్రైలర్ తో చిత్రంపై ప్రేక్షకులల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ చిత్రం తెలుగులోనూ ‘కబాలి’ పేరుతోనే విడుదల అవుతుండగా..

అభిషేక్ పిక్చర్స్ వారు ఏ‌పి, నైజాం ఏరియాలకు సంబంధించిన చిత్ర హక్కులకు దాదాపు రూ.26 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో రజనీ సరసన రాధికా ఆప్టే జంటగా నటిస్తోంది. కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు సంతోష్ నారాయణ్ సమకూర్చిన స్వరాలు మే 30 న విడుదల చేయనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus