Acharya Trailer: ‘ఆచార్య’ ట్రైలర్.. చరణ్ పాత్ర చనిపోతుందా..?

  • April 12, 2022 / 06:37 PM IST

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా… కాజల్ హీరోయిన్ గా … చరణ్,పూజా హెగ్డేలు కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’. ఏప్రిల్ 29న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, పాటలు సూపర్ హిట్ అయ్యాయి.దాంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను రెట్టింపు చేస్తూ తాజాగా ట్రైలర్ ను కూడా విడుదల చేసింది చిత్ర బృందం.’మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్’ మరియు ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ బ్యానర్ల పై నిరంజన్ రెడ్డి,అన్వేష్ రెడ్డి చరణ్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘దివ్య వనం ఒకవైపు.. తీర్థ జలం ఒకవైపు.. నడుమ పాద ఘట్టం’ అంటూ రాంచరణ్ వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలైంది. ట్రైలర్ ప్రారంభంలో చరణ్ ఎక్కువగా కనిపించాడు. ‘ఆపద వస్తే ఆ అమ్మోరు తల్లే మమ్మల్ని ఆవహించి ముందుకు పంపుద్ధి.. ధర్మస్థలి అధర్మస్థలి ఎలా అవ్వుద్ది’ అంటూ చరణ్ చెప్పే డైలాగ్ బాగుంది. ట్రైలర్ 1:06 నిమిషాల వద్ద చిరు ఎంట్రీ ఇచ్చారు. విలన్ సోనూ సూద్ తో పవర్ ఫుల్ డైలాగులు ఉన్నాయి.

హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. ట్రైలర్ చివర్లో చిరు- చరణ్ కలిసి పాల్గొన్న యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్ గా నిలిచాయి. అయితే తనికెళ్ళ భరణి చిరుని ‘సిద్ద తెలుసా మీకు’ అంటూ చిరుని అడగడంతో ఈ సినిమాలో చరణ్ పాత్ర చనిపోతుందా అనే అనుమానాలు కలిగించింది.మణిశర్మ బిజిఎమ్ కూడా బాగా కుదిరింది. మరి సినిమా చూస్తేనే కానీ క్లారిటీ రాదు. ట్రైలర్ అయితే బాగుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!


‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus