వైరల్ అవుతున్న జయం రవి ఆసక్తికర వ్యాఖ్యలు!

  • May 2, 2023 / 09:44 AM IST

మణిరత్నం డైరెక్షన్ లో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్2 మూవీ పాజిటివ్ టాక్ తో థియేటర్లలో ప్రదర్శితం అవుతున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జయం రవి మాట్లాడుతూ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాలు ఐదేళ్ల శ్రమ అని ఆయన అన్నారు. ఈ సినిమా కోసం ప్రముఖ నటీనటులతో నటించడం సంతోషంగా ఉందని జయం రవి చెప్పుకొచ్చారు.

షూటింగ్ టైమ్ లో వేర్వేరు విషయాల గురించి అందరం ముచ్చటించుకునే వాళ్లమని ఆయన తెలిపారు. ఇలాంటి భారీ చిత్రాన్ని మళ్లీ తీస్తే మాత్రమే ఇంతమంది నటీనటులతో నటించడం సాధ్యమవుతుందని జయం రవి చెప్పుకొచ్చారు. భారీ సినిమాలలో నటించిన తర్వాత మీరు నటించే సాధారణ చిత్రాలను ఆదరిస్తారా అనే ప్రశ్నకు రోజూ బిర్యానీ తినలేం కదా అని ఆయన అన్నారు. సాంబార్ అన్నం తినక తప్పదు అని ఆయన కామెంట్ చేశారు.

పొన్నియిన్ సెల్వన్ తరహా సినిమాలు అరుదుగా మాత్రమే వస్తాయని తన తర్వాత సినిమాలు ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోవనే టెన్షన్ అయితే లేదని జయం రవి అభిప్రాయపడ్డారు. తాను నటించిన ఇరైవన్ సినిమా త్వరలో రిలీజ్ కు సిద్ధంగా ఉందని జయం రవి కామెంట్లు చేశారు. సైరన్ అనే మూవీలో డ్యూయల్ రోల్ చేస్తున్నానని జయం రవి చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో తండ్రీ కొడుకుల పాత్రల్లో కనిపిస్తానని తండ్రి రోల్ కోసం సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపిస్తానని ఆయన కామెంట్లు చేశారు.

ప్రస్తుతం సైరన్ మూవీ షూట్ చివరి దశలో ఉందని ఆయన కామెంట్లు చేశారు. తన డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలో కార్తీ హీరోగా నటిస్తారని జయం రవి పేర్కొన్నారు. తాను ప్రస్తుతం చిన్నచిన్న కథలను తయారు చేసుకుంటూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నానని ఆయన కామెంట్లు చేశారు. జయం రవికి తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలు దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus