Vijay: పెట్రోల్ రేట్లు పెంచినందుకు వెరైటీగా నిరసనకు దిగాడట..!

  • April 6, 2021 / 02:24 PM IST

ఓ స్టార్ హీరో సైకిల్ తొక్కుకుని వెళ్లి ఓటేసి వచ్చాడట. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఈరోజు దక్షిణ భారతదేశంలోని మూడు రాష్ట్రాలు అయిన తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో అసెంబ్లీలకు పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.అలాగే పశ్చిమ బెంగాల్, అస్సాం వంటి రాష్ట్రాల్లో కూడా మూడో దశ పోలింగ్ ను నిర్వహిస్తున్నారు. అయితే తమిళనాడు, కేరళ పుదుచ్చేరిలో ఒకే విడతలో పోలింగ్ జరుగుతుండడాన్ని ఓ విశేషంగా చెప్పుకోవాలి.

అయితే మరోపక్క కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కూడా ఉండడంతో అన్ని జాగ్రత్తలు తీసుకునే ఈసీ పోలింగ్ ను నిర్వహిస్తోంది. అందుకు తగినట్టుగానే తమిళనాడులో ఉన్న 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 88,936 పోలింగ్‌ కేంద్రాల్లోనూ పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతుంది. సినీ ఇండస్ట్రీ నుండీ కూడా కొంతమంది సెలబ్రిటీలు క్యూలో నిలబడి మరీ ఓట్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి స్టార్ హీరో అయిన విజయ్.. సైకిల్ పై పోలింగ్ కేంద్రానికి వెళ్లి మరీ ఓటేశాడు.

దానికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దేశంలో పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో హీరో విజయ్ ఇలా వైరైటీగా నిరసనకు దిగాడని సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక విజయ్ అభిమానులు అయితే ఇలా బయటకి రావద్దని.. కరోనా సెకండ్ వేవ్ ను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ కామెంట్లు పెడుతున్నారు.


వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus