షాకింగ్ కామెంట్స్ చేసిన నటి ఖుష్బూ..!

  • June 16, 2020 / 01:15 PM IST

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ ఇటీవల ఆత్మహత్య చేసుకుని చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయం యావత్ భారతదేశ ప్రజలందరినీ.. చాలా బాధపెడుతుందనే చెప్పాలి. కొంత కాలంగా డిప్రెషన్ కు గురవ్వడం వల్ల అతను ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడు అని అతని సన్నిహితులు చెబుతున్నారు.అయితే కారణం ఏదైనా ఆత్మహత్య చేసుకోవడం అనేది పర్మినెంట్ సొల్యూషన్ కాదని ఎంతో మంది అభిప్రాయపడుతున్నారు.ఇటీవల నటి ఖుష్బూ కూడా ఈ విషయాల పై స్పందించింది.

నేను కూడా తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవ్వడం వల్ల ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది ఖుష్బూ. ఆమె మాట్లాడుతూ…. “ప్రతి మనిషి బాధ, ఒత్తిడిని ఫేస్ చేస్తాడు. ‘నాకు ఎలాంటి సమస్యలు లేవు’ అని చెబితే.. అది అబద్ధమే అవుతుంది. నేను కూడా మానసిక ఒత్తిడికి గురయ్యాను. నా జీవితానికి ఇక గుడ్ బై చెప్పెయ్యాలి అనుకున్నాను. అయితే తరువాత వాటితో పోరాడాలనే కసి నాలో ఏర్పడింది.

నన్ను ఓడించాలని, నాశనం చెయ్యాలని ప్రయత్నిస్తున్న ఆ సమస్యల కంటే నేను బలమైన దాన్ని అని నిరూపించాలనుకున్నాను. నా ముగింపు కోసం ఎదురుచూస్తున్న వారిని ఓడించాలని కంకణం కట్టుకున్నాను. ఆ సమయంలో నా స్నేహితులు నాకు చాలా సాయం చేసారు. నాకు పోరాడే శక్తి ఉంది కాబట్టే ఈరోజు ఇలా ఉండగలిగాను” అంటూ ఖుష్బూ చెప్పుకొచ్చింది.

Most Recommended Video

కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus