కరోనా వల్ల కాల్ సెంటర్స్ లో పనిచేస్తుందట…!

  • April 15, 2020 / 04:35 PM IST

ఇప్పుడున్న కరోనా ఎఫెక్ట్ వల్ల ప్రజలంతా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దానిని అరికట్టడానికి లాక్ డౌన్ ఒక్కటే మార్గం అని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ నేపధ్యంలో లాక్ డౌన్ ను ఏర్పాటు చేసాయి. మొదట ఏప్రిల్ 14 వరకే అని ప్రకటించిన ప్రభుత్వం.. ఆ తరువాత మే 3 వరకూ దానిని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇదిలా ఉండగా … లాక్ డౌన్ కారణంగా డైలీ ఇన్కం పై ఆధారపడిన వారు.. నిత్య అవసరాలకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు.

ఇలాంటి తరుణంలో సినీ సెలబ్రిటీలు మేమున్నాం అంటూ వారికి తోచిన సాయం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఓ హీరోయిన్ కాల్ సెంటర్ లో పనిచేస్తుందట.అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ‘మేడ మీద అబ్బాయి’ అలాగే ‘గాయిత్రి’ వంటి సినిమాల్లో నటించిన నిఖిల విమల్.. కేరళ ప్రభుత్వం వారు కేరళలోని కన్నూర్ జిల్లాలో ఓ కోవిడ్-19 కాల్ సెంటర్ ఏర్పాటు చేసారు. ఆ కాల్ సెంటర్ లో పనిచేస్తూ హీరోయిన్ నిఖిల విమల్.

ఆపదలో ఉన్న వారికి ఈ వేదికగా హెల్ప్ చేస్తోందట. ప్రజలకు కావాల్సిన అవసరాలు ఈ సేవా కేంద్రానికి ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. వారి ఫిర్యాదులను స్వీకరించిన వాలంటీర్ల ద్వారా… ఈమె ప్రజలకు సాయం చేస్తుందట. ఈ మేరకు రోజుకి 20 కిలో మీటర్లు ప్రయాణం చేస్తుందని తెలుస్తుంది. ఏమైనా ఈమె గొప్ప మనసుకి అందరూ ప్రసంసలు కురిపిస్తున్నారు.

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus