Priyamani: ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టిన ప్రియమణి..!

  • June 16, 2021 / 09:42 PM IST

ప్రియమణి తన సెకండ్ ఇన్నింగ్స్ ను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటోంది. పెళ్ళైన తర్వాత కొంతకాలం సినిమాలను తగ్గించిన ఈ అమ్మడు.. ఇప్పుడు ఓ పక్క బుల్లితెర పై అలరిస్తూనే మరో పక్క కథా బలం ఉన్న సినిమాల్లో ప్రాముఖ్యత కలిగిన పాత్రలను ఎంపిక చేసుకుంటుంది. రానా, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ‘విరాట పర్వం’ సినిమాలో ఈమె భారతక్క అనే నక్సలైట్ పాత్రలో కనిపించబోతుంది. అలాగే ‘నారప్ప’ సినిమాలో వెంకటేష్ సరసన మెయిన్ హీరోయిన్ గా రాణిస్తుంది.

ఇవి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇదిలా ఉండగానే.. ఇటీవల విడుదలైన ‘ఫ్యామిలీ మెన్2’ వెబ్ సిరీస్ ద్వారా దేశం మొత్తం పాపులర్ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది. ఈ క్రమంలో ఆమె ఫోర్జరీకి కూడా పాల్పడినట్టు తెలిపి షాకిచ్చింది. ప్రియమణి మాట్లాడుతూ.. “మా నేటివ్ ప్లేస్ కేరళ అయినప్పటికీ నేను పుట్టి పెరిగిందంతా బెంగళూరులోనే.! మా నాన్నగారు బిజినెస్మెన్. అమ్మ ఓ బ్యాంకు ఎంప్లాయి.మా అన్నయ్య కాస్త సైలెంట్ అయినప్పటికీ నేను మాత్రం అల్లరి పనులు చాలానే చేస్తుండేదాన్ని.

ఏ క్లాసో గుర్తు లేదు కానీ ఓసారి నా ప్రోగ్రెస్‌ రిపోర్ట్ లో మా అమ్మ సంతకాన్ని ఫోర్జరీ చేశాను. అది తెలిసి మా అమ్మకు నా పై కోపం వచ్చింది. అయితే మళ్ళీ అది రిపీట్ చేయను అని అమాయకంగా చెప్పేసరికి నవ్వేసింది. ఇక, రేపు పరీక్షలనగా నా ఫిజిక్స్‌, కెమిస్ట్రీ రికార్డులను ముందేసుకుని కూర్చునేదాన్ని. అది చూసి నాన్న, అన్నయ్య రాత్రంతా నాతో పాటు కూర్చుని వాటన్నింటినీ పూర్తి చేసేవారు.మా ఇంట్లో నేను చిన్నదాన్ని కాబట్టి నేను ఎంత అల్లరి చేసినా వాళ్లకు కోపం వచ్చేది కాదు. అంతేకాదు ఇంటికెవరైనా వస్తే వాళ్ళ దగ్గర కూడా అమ్మానాన్న ఇవన్నీ చెప్పి నవ్వుకునేవారు. అవి తలుచుకుంటే ఇప్పటికీ నాకు నవ్వు వస్తూనే ఉంది” అంటూ చెప్పుకొచ్చింది.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus