ఆ సినిమా చేసినందుకు బాధపడుతున్న రాశీ ఖన్నా.!

  • March 24, 2018 / 07:55 AM IST

అక్కినేని ఫ్యామిలీ  సినిమా మనంలో తళుక్కున మెరిసి.. ఊహలు గుసగుసలాడే సినిమాతో యువత అందరూ ఆమె గురించి మాట్లాడుకునేలా చేసింది రాశీ ఖన్నా. ఈ ఢిల్లీ బ్యూటీ బాలీవుడ్ మీదుగా టాలీవుడ్ లోకి వచ్చినప్పటికీ.. ఇక్కడ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఎదుగుతోంది. రీసెంట్ గా తొలి ప్రేమ సినిమాతో సూపర్ హిట్ అందుకొని చేతినిండా అవకాశాలు పట్టేసింది. ఇప్పుడు మూడు తమిళ సినిమాల్లో నటిస్తోంది. అలాగే నితిన్ సరసన శ్రీనివాస్ కళ్యాణం సినిమాలో కథానాయికగా ఎంపికైంది.

ఫుల్ బిజీలో ఉన్న ఈ భామ రీసెంట్ గా ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూ లో ఆసక్తికర విషయాలు చెప్పింది. ఇప్పటి వరకు తాను 15 సినిమాల్లో నటించానని.. వాటి ఫలితం ఏమైనా తనకి సంతృప్తి ఇచ్చిందని వెల్లడించింది. “నేను ఇప్పటి వరకు చేసిన 15 సినిమాల్లో ఒక సినిమా విషయంలో బాధపడ్డాను.  కథ వింటున్నప్పుడు బాగానే అనిపించింది. తెరపై చూసుకున్నప్పుడు మాత్రం చాలా నిరాశ కలిగింది. ఆ సినిమాను చేయకుండా ఉండాల్సింది.” అని వెల్లడించింది. ఆ సినిమా ఏమిటని ప్రశ్నించగా పేరు చెప్పడానికి నిరాకరించింది. చాలామంది ఆ మూవీ శివమ్ అని గెస్ చేస్తున్నారు. మరి రాశీ మనసులో ఏముందో.. ఎవరికీ తెలుసు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus