వరుస విజయాలతో దూసుకుపోతున్న అఖిల్ హీరోయిన్

  • August 2, 2018 / 04:19 AM IST

‘అఖిల్’ సినిమాతో అక్కినేని వారబ్బాయి అఖిల్‌కే కాకుండా హీరోయిన్ సాయేషా సైగల్‌కు కూడా మొదటి చిత్రమే. ‘అఖిల్’ తర్వాత ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లో అజయ్ దేవగణ్ సరసన ‘శివాయ్’ చిత్రంలో నటించి యావరేజ్ హిట్ కొట్టింది. ఇక ‘శివాయ్’ తర్వాత తమిళ్‌లో జయం రవితో నటించిన ‘వనమగన్’ విజయాన్ని అందుకోకపోయినా సాయేషా అందాలకు తమిళ తంబీలు ఫ్లాట్ అయిపోయారు. ‘వనమగన్’ తర్వాత ఇప్పటికే రెండు తమిళ చిత్రాల్లో బుక్కైంది సాయేషా. వాటిలో ఒకటి విశాల్ సరసన ‘కరుప్పు రాజా వేలై రాజా’ కాగా మరొకటి విజయ్ సేతుపతితో ‘జుంగా’ చిత్రం.

కోలీవుడ్ రైజింగ్ హీరోస్‌గా దూసుకుపోతున్న విశాల్, విజయ్ సేతుపతి చిత్రాలు ఒప్పుకోవడంతోపాటు.. ఇటీవల కార్తీతో నటించిన “చినబాబు” మంచి విజయం అందుకోవడంతో ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇక “భలే భలే మగాడివోయ్” చిత్రానికి రీమేక్ గా తమిళంలో తెరకెక్కుతున్న “ఘజినీకాంత్”తో అమ్మడు మరో మంచి హిట్ అందుకొనేలా ఉంది. వచ్చే వారం విడుదలకానున్న ఈ సినిమా కూడా హిట్ అయితే.. ఇక అమ్మడికి తమిళంలో వరుస అవకాశాలు రావడం ఖాయం. చూస్తుంటే.. తెలుగులో క్లిక్ అవ్వలేకపోయిన సాయేషా.. తమిళంలో స్టార్ హీరోయిన్ గా నిలిచేలా ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus