మహేష్ సినిమాలో అవకాశాన్ని అందుకున్న అదితి రావు హైదరి

  • June 21, 2018 / 01:05 PM IST

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన సమ్మోహనం చిత్రంతో అదితీ రావ్ హైదరీ తెలుగులో అడుగుపెట్టింది. తొలి చిత్రం తోనే అదరగొట్టింది. ఈ సినిమా చూసిన మహేష్ బాబు ఆమె నటనకు ఫిదా అయిపోయారు. అత్యుత్తమ నటన ప్రదర్శించిందని అభినందించారు. అంతటితో ఆగిపోలేదు. పిలిచి తన సినిమాలో అవకాశం ఇచ్చారు. భరత్ అనే నేను సినిమా తర్వాత మహేష్ బాబు వంశీ పైడి పల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. మహేష్ కెరీర్ లో ప్రతిష్టాత్మకమైన ఈ చిత్రం షూటింగ్ మొన్న డెహ్రాడూన్ లో ప్రారంభయింది. ఇందులో హీరోయిన్ గా డీజే బ్యూటీ పూజా హెగ్డే నటిస్తోంది.

అలాగే సినిమాలో కీలకమైన స్నేహితుడి పాత్రలో అల్లరి నరేష్ కనిపించనున్నారు. ఇక నరేష్ పక్కన జోడీని కూడా ముందుగా ‘అర్జున్‌రెడ్డి’ భామ షాలిని పాండే ని సెలక్ట్ చేశారు. కానీ ఆమెకి డేట్స్ క్లాష్ కావడంతో నో చెప్పింది. ఆ స్థానంలో ఎవరిని తీసుకోవాలని డైరక్టర్ ఆలోచిస్తుంటే మహేష్ అదితి పేరును సూచించడం, ఓకే చేయడం ఒక్కరోజులో జరిగిపోయినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించనున్నారు. ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలనీ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్ లు భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus