పూరి ఆకాష్ తో జతకట్టనున్న కొత్త హీరోయిన్

  • November 26, 2018 / 01:07 PM IST

పూరి జగన్నాథ్ ఆకాష్ తో ‘మెహబూబా’ సినిమా తీయగా ఈ సినిమా ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక పూరి తన కొడుక్కి మంచి విజయాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఆకాష్ తో మరొక సినిమా తీసే ప్లాన్ లో ఉన్నారని తెలుస్తుంది. కానీ ఈ సినిమాకు కథాకథనాలు అందించి నిర్మాతగానే వ్యవ్యహరించాలని భావించి ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను అనిల్ అనే ఒక కొత్త కుర్రాడికి అప్పగించారంటా. పూరి జగన్నాథ్ కి ‘మెహబూబా’ సినిమా నిర్మాతగా ఆయనకి నష్టాలని తెచ్చినప్పటికీ ఈ కథ విషయంలో మాత్రం చాలా నమ్మకంతో ఉన్నారంటా .

ఇక ఆకాష్ హీరోగా నటించే ఈ సినిమాలో హీరోయిన్ గా చాలా మందినే సంప్రదించగా చివరకు గాయత్రీ భరద్వాజ్ అనే అమ్మాయిని సెలెక్ట్ చేశారంటా. ఈ సినిమాతో ఈమె తెలుగు పరిశ్రమకి పరిచయం కానుంది. ఈ సినిమా మాఫియా నేపథ్యంలో సాగే ఒక ప్రేమకథ అని చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుబెట్టనున్న పూరి ఈ సినిమా విషయంలో చాలా నమ్మకంగా ఉండటమే కాకుండా ఆకాష్ కి ఈ సినిమాతో మంచి బ్రేక్ రావడం గ్యారెంటీ అని భావిస్తున్నారట. మరి పూరి మార్క్ తో మాఫియా నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథ హీరోగా ఆకాష్ కి ఎలాంటి పేరు తెచ్చి పెడుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus