అందరిని షాక్ కి గురిచేసిన సాయి పల్లవి

  • November 3, 2016 / 08:34 AM IST

మలయాళ ప్రేమమ్ చిత్రంలో మలార్ పాత్రతో మంచి పేరు తెచ్చుకున్న నటి సాయి పల్లవి. ఒకే ఒక సినిమా ద్వారా దక్షిణాది సినీ పరిశ్రమల నుంచి అవకాశాలను అందుకుంది. వైద్య విద్యను పూర్తి చేసేవరకు ఏ సినిమాను  ఒప్పుకోని ఈ భామ చదువు అనంతరం తెలుగు సినిమాకు సంతకం చేసింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఫిదా మూవీలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన నటిస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో సాయి పల్లవి తెలంగాణ అమ్మాయి పాత్రను పోషిస్తోంది.

తాజాగా ఈ నేచురల్ బ్యూటీ అభిమానులతో ముచ్చటించింది. వారి అడిగిన ప్రశ్నలకు  సంచలన సమాధానం చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. ” ప్రేమ వివాహం చేసుకుంటారా? పెద్దలు నిశ్చియించిన పెళ్లి చేసుకుంటారా?” అని ఓ ఫ్యాన్ సాయి పల్లవిని అడగగా అందుకు ఆమె “అసలు నేను పెళ్లే చేసుకోను” అని స్పష్టం చేసింది. కారణం ఏమిటని ప్రశ్నించగా తనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులతోనే ఉంటూ, వారిని బాగా చూసుకుంటానని వెల్లడించింది. ఈ మాట తో సాయి పల్లవి యువతలో మంచి మార్కులు కొట్టేసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus