సాయి ధరమ్ తేజ్ క్షేమంగా ఉన్నాడు: నిర్మాత అల్లు అరవింద్

  • September 11, 2021 / 10:17 AM IST

”నిన్న రాత్రి 7 గంటల 30 నిమిషాల ప్రాంతంలో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ కు గురయ్యాడు. ప్రస్తుతం అతనికి ఎలాంటి ప్రమాదం లేదు. చాలా క్షేమంగా ఉన్నాడు. నేను వైద్యుల దగ్గర మాట్లాడి మీ దగ్గర ఈ మాట చెబుతున్నాను.. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం విషయంలో కంగారు అవసరం లేదు. మీకు డాక్టర్ల హెల్త్ బులిటెన్ కావాలంటే ఇంకో అరగంటలో వస్తుంది. తలకు గానీ.. శరీరంలో మారెక్కడా ఇంటర్నల్ బ్లీడింగ్ లేవని వైద్యులు తెలిపారు. రేపు ఉదయం జనరల్ వార్డుకు తీసుకొస్తారని.. సాధారణంగా మాట్లాడతాడని వైద్యులు నాతో చెప్పారు.

మీడియాలో ఏవేవో వార్తలు రాకుండా ఫ్యామిలీ నుంచి ఒకరు వచ్చి చెప్పాలి కాబట్టి.. నేను చెప్తున్నాను. మళ్లీ చెప్తున్నాను సాయి ధరమ్ తేజ్ క్షేమంగా ఉన్నాడు..” అని అపోలో దగ్గర మీడియాతో తెలిపారు అల్లు అరవింద్.

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus