బాలయ్య సినిమాపై ఇండైరక్ట్ సెటైర్ వేసిన అల్లుఅర్జున్

  • December 28, 2016 / 10:20 AM IST

అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్ మెగా హీరోగా చిత్ర పరిశ్రమకు పరిచయమైనప్పటికీ తనకంటూ ఓ గుర్తింపును సాధించుకున్నారు. స్టైలిష్ స్టార్ గా రికార్డులను బద్దలు కొడుతున్నారు. ఆయన గత చిత్రం సరైనోడు వందకోట్ల క్లబ్ లో చేరడంతో స్టార్ హీరో అనిపించుకున్నారు. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో దువ్వాడ జగన్నాథం చిత్రం చేస్తున్న బన్నీ పలు వాణిజ్య సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా ఓ కంపెనీ ప్రచార నిమిత్తం నిన్న(మంగళవారం) వైజాక్ కు వెళ్లిన అల్లు అర్జున్ గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

అసలు ఏమి జరిగిందంటే.. బన్నీ వైజాక్ కి వెళ్ళగానే ఆయన వద్దకు మెగా అభిమానులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. ఫ్యాన్స్ తో అల్లు అర్జున్ కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంలో “చిరంజీవి 150వ సినిమా ఖైదీ నంబర్ 150 ఎలా ఉండబోతుంది” అని అభిమానులు అడగగా.. ‘ఈ సారి సంక్రాంతి మనదే’ అని బన్నీ వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఈ మాట మెగా ఫ్యాన్స్ కి అనందం కలిగించినప్పటికీ, నందమూరి ఫ్యాన్స్‌కి ఆగ్రహం తెప్పించింది. బాలకృష్ణ వందో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా కన్నా ఖైదీ నంబర్ 150నే సూపర్ హిట్ అన్న అర్థంలోనే బన్నీ ఆ వ్యాఖ్యలు చేశాడని భావిస్తున్నారు. దీనికి తగిన విధంగా బన్నీకి రీ కౌంటర్ ఇవ్వడానికి నందమూరి అభిమానులు సమయం కోసం చుస్తున్నారంట. బహుశా సంక్రాంతి అనంతరమే సినిమా చూసి పంచ్ ఇవ్వనున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus