ఫ్యామిలీ తో కలిసి ఆలయాలను సందర్శిస్తున్న బన్నీ

  • August 5, 2017 / 11:14 AM IST

దువ్వాడ జగన్నాథం చిత్రం తర్వాత ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’ సినిమా చేస్తున్నారు. రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్, బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ వారం మొదలయింది. నాలుగురోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్న అల్లు అర్జున్, తన కుటుంబ సభ్యులతో కలిసి నిన్న(శుక్రవారం) హంపీకి వెళ్లారు. అక్కడ మహిమకలిగిన విరూపాక్షేశ్వరుడిని దర్శించుకున్నారు. అనంతరం కమల్‌ మహల్‌, రాతిరథం, విజయవిఠల ఆలయాలను సందర్శించారు.

హంపీలు బన్నీని చూడగానే అభిమానులు ఆయన చుట్టూ చేరారు. సెల్ఫీ లు తీసుకునేందుకు ఎగబడ్డారు. అభిమానులు ఎక్కువగా చేరుకోతుండడంతో స్మారకాల సందర్శన రద్దు చేసుకుని పోలీసుల సహాయంతో హొసపేటెలోని ఓ హోటల్‌కు వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. ఈరోజు స్మారకాలను చూసారు. అయినా అభిమానులు అతనితో సెల్ఫీకోసం గుమిగూడారు. సంయమనంతో ఫ్యాన్స్ తో ఫోటోలు దిగారు. అక్కడి నుంచి బయలు దేరి రేపు హైదరాబాద్ కి రానున్నట్లు తెలిసింది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus