సరైన ట్రాక్ లో పడే వరకూ ప్రయత్నిస్తూనే ఉంటా : శిరీష్

  • June 1, 2019 / 03:59 PM IST

అల్లు శిరీష్ హీరోగా వచ్చిన ‘ఎబిసిడి’ చిత్రం ప్లాప్ గా మిగిలింది. మే 17 న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుండే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంతో కచ్చితంగా హిట్టందుకుందామనుకున్న శిరీష్ కు నిరాశే ఎదురైంది. ఈ విషయాన్నీ స్వయంగా శిరీష్ తన సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చాడు. తన చిత్రం ప్లాప్ అని ఒప్పుకున్నాడు.

మే 30 న అల్లు శిరీష్ పుట్టిన రోజు నాడు తన సోషల్ మీడియాలో ఇలా చెప్పుకొచ్చాడు.. ” ‘ఎబిసిడి’ చిత్రం విజయం పై చాలా ఆశలు పెట్టుకున్నా… కానీ ఆశించిన మేరకు విజయం సాధించలేదు ఆ చిత్రం. సరైన విజయం కోసం, సరైన ట్రాక్ లో పడే వరకూ కష్టపడి ప్రయత్నిస్తూనే ఉంటా” అంటూ చెప్పుకొచ్చాడు. ఏమైనా ఈమాటలకు శిరీష్ ను అభినందించాల్సిందే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus