“కబాలి” కి సీక్వెల్ చేస్తా : పా.రంజిత్

  • July 22, 2016 / 12:25 PM IST

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ బాషా తర్వాత గ్యాంగ్ స్టర్ గా నటించిన చిత్రం “కబాలి”. ఈ చిత్ర టీజర్ యూట్యూబ్ లో రికార్డ్ సృష్టించింది. యువ దర్శకుడు పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఈనెల ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్ కి ముందే 220 కోట్ల బిజినెస్ చేసిన ఈ ఫిల్మ్ 500 కోట్లు వసూలు చేస్తుందని చిత్ర నిర్మాత కలైపులి ఎస్.థాను ధీమాగా చెబుతున్నారు.

తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కబాలి ఫీవర్ ని చూస్తుంటే బాహుబలి రికార్డులను బద్దలు కొట్టేట్టు ఉందని సినీ వర్గాలు అనుకుంటున్నాయి. మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూ లో పాల్గొన్న డైరక్టర్ పా.రంజిత్ ఆసక్తికర సంగతులు వెల్లడించారు. సూపర్ స్టార్ ని డైరక్ట్ చేసి అవకాశం రావడం తాను అదృష్టంగా భావించడం లేదని, తన ప్రతిభకు, కష్టానికి గుర్తింపుగా ఫీలవుతున్నానని చెప్పారు. కబాలి సీక్వెల్ తీస్తారా? అనే ప్రశ్నకు బదులిస్తూ… “కబాలికి సీక్వెల్ కథ నా దగ్గర ఉంది. అయితే  ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందనను చూసి సీక్వెల్ చేయాలో వద్దో నిర్ణయిస్తాను ” అని పా. రంజిత్ వెల్లడించారు.

https://www.youtube.com/watch?v=_ohENVufevg

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus