‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ ఫిక్స్!

  • November 5, 2018 / 10:49 AM IST

మాస్ మహరాజా రవితేజ, గ్లామర్ బ్యూటీ ఇలియానా జంటగా  శ్రీను వైట్ల దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘ అమర్ అక్బర్ ఆంటోనీ ‘..నవంబర్ 16 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక నవంబర్ 10 న నిర్వహించబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు..ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, మొదటి పాటకు ప్రేక్షకులనుంచి మంచి స్పందన రాగ, రెండవ పాటను దీపావళి సందర్భంగా రేపు విడుదల చేయనున్నారు..

రవితేజ మూడు డిఫరెంట్ రోల్స్ లో కనిపించబోతున్న ఈ సినిమా  స‌రికొత్త క‌థ‌, భిన్న‌మైన‌ నేప‌థ్యంలో తెర‌కెక్కగా   ఈ చిత్రంలో లయ, సునీల్, వెన్నెల కిషోర్, రఘు బాబు, తరుణ్ అరోరా, అభిమన్యు సింగ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.. ఎస్ఎస్ థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. వెంక‌ట్ సి దిలీప్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ‌ మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus