ట్రోల్ చేసిన నెటిజెన్ కు పద్దతిగా కౌంటర్ ఇచ్చిన అనసూయ..!

  • February 8, 2021 / 02:37 PM IST

సోషల్ మీడియాలో యాంకర్లను ట్రోల్ చెయ్యడం కొత్త విషయం ఏమీ కాదు.పండ్లున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు.. క్రేజ్ లో ఉన్న భామల పై ఇలాంటి ట్రోలింగ్ కామనే..! హీరోయిన్లతో పాటు స్టార్ యాంకర్లు అయిన అనసూయ, రష్మీ వంటి వారి పై ఇవి ఎక్కువగా జరుగుతుంటాయి. బుల్లితెరతోపాటు, వెండితెర పై కూడా ఈ ఇద్దరు భామలు రాణిస్తున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ… కొత్త కొత్త ఫోటోలను షేర్ చేస్తుంటారు కాబట్టి.. వీరినే నెటిజన్లు ఎక్కువగా టోల్ చేస్తుంటారు.

ఇప్పుడు కూడా ఓ నెటిజెన్ అనసూయను చాలా ఘోరంగా ట్రోల్ చేసాడు. ఈ క్రమంలో అనసూయ కూడా తన దైన శైలి స్పందించింది. మేటర్ ఏంటంటే.. అనసూయకు సంబంధించి మూడేళ్ళ క్రితం ఫోటోని ఓ నెటిజెన్ షేర్ చేసాడు. ఈ ఫోటోలో జబర్దస్త్ బ్యాచ్ అంతా ఉన్నారు. అయితే సడన్ గా అనసూయ కళ్ళు తిరిగి పడిపోతున్నట్టు ఉంది. ‘అందరి అటెన్షన్ డ్రా చెయ్యడం కోసం అనసూయ కావాలనే ఇలా చేస్తుంటుంది. ‘అటెన్షన్ బి*’… అంటూ ఘోరమైన కామెంట్ పెట్టాడు.

దీనికి అనసూయ స్పందిస్తూ… ‘ఎప్పుడో 3 ఏళ్ళ క్రితం ఫోటోని షేర్ చేసి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నావ్. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత నాకు లో బీపీ వచ్చింది. పైగా అది తెల్లవారు జామున అంటే ఉదయం 5.30 గంటల ప్రాంతంలో జరిగింది. 22 గంటల పాటు విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల నాకు కళ్లు తిరిగాయి. అంతేకానీ నువ్వు ఊహించుకునేవి ఏమీ కావు’ అంటూ చాలా పద్దతిగానే సమాధానమిచ్చింది అనసూయ.

Most Recommended Video

జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus