మళ్ళీ విలేజ్ బ్యూటీగా కనిపించనున్న అనసూయ

  • May 17, 2018 / 09:28 AM IST

అంతర్జాతీయ సినిమా, సరికొత్త కథలు అందుబాటులోకి వచ్చాక మన హీరోలు రిపీటెడ్ స్టోరీస్ చేయడం మానేశారు కానీ.. ఇదివరకు పోలీస్ గా నటించిన సినిమా ఒకటి సక్సెస్ అవ్వగానే వెంటనే మరో పోలీస్ స్టోరీ చేసేవారు. అయితే.. ఇప్పుడు ఆ రిపిటీషన్ తగ్గింది. కానీ.. హీరోలకంటే ఆప్షన్స్ ఎక్కువ కాబట్టి వాళ్ళు ఈ రిపిటీషన్ ను తగ్గించుకోగలరు. కానీ.. హీరోయిన్స్ కి, ముఖ్యంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ కి ఆ ఆప్షన్ ఉండదు కదా. అందుకే ఒకసారి పోషించిన పాత్ర తరహాలోనే మరో పాత్ర లభించినా తప్పక చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు అనసూయ పరిస్థితి అలానే తయారయ్యింది.

“రంగస్థలం” సినిమాలో రంగమ్మత్తగా అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్ని అలరించిన అనసూయకు మళ్ళీ అదే పల్లెటూరి పెద్దావిడ పాత్ర పోషించిన అవసరం వచ్చింది. వెంకటేష్-వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ కథానాయికలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో అనసూయ ఓ కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం అనసూయ ఈ చిత్రంలో పల్లెటూరి భామగా కనిపించబోతోందట. మరీ “రంగస్థలం” రేంజ్ లో అత్తగా కాకుండా “సోగ్గాడే చిన్ని నాయన”లో పోషించిన పల్లెటూరి పడుచు పాత్రను అనసూయ పోషించనుందట. జూన్ నుంచి రెగ్యులర్ షూట్ మొదలవనున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus