Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Advertisement

విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో 5వ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మరో హీరోగా ఎంపికయ్యాడు. 2027 సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లానింగ్ జరుగుతుంది.

Krithi Shetty

వెంకటేష్ సరసన హీరోయిన్ గా కీర్తి సురేశ్ ఎంపికైనట్టు వార్తలు వినిపించాయి. అయితే చిత్రబృందం ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. కానీ కళ్యాణ్ రామ్ కి జోడీగా ఏ హీరోయిన్ నటిస్తుంది అనే విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు.

అయితే మొత్తానికి ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి(Krithi Shetty) ఎంపికైనట్టు స్పష్టమవుతుంది. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి కన్ఫర్మ్ చేశాడు.ఈరోజు జరిగిన ‘ఎల్ ఐ కె'(LIK) ఈవెంట్ కి అతను గెస్ట్ గా హాజరయ్యాడు.

అనిల్ రావిపూడి స్పీచ్ ఇస్తున్న టైమ్లో … ” ఇందాక త్వరలో వర్క్ చేద్దామని చెప్పింది. ఆల్రెడీ బయట రాసేశారు. మనం అఫీషియల్ గా చెప్పాల్సిన పనిలేదు. మన బ్రదర్స్ అంతా రాసేస్తారు. సొ సీ యు సూన్ ఆన్ సెట్స్(త్వరలో సెట్స్ లో కలుద్దాం)” అంటూ రివీల్ చేసేశాడు. సొ అనిల్ రావిపూడి మాటల్ని బట్టి అర్దం చేసుకోవచ్చు.. కృతి శెట్టి తన సినిమాలో హీరో కళ్యాణ్ రామ్ కి జోడీగా నటిస్తుంది అని..! వాస్తవానికి కృతి శెట్టికి ‘బంగార్రాజు’ తర్వాత ఒక్క హిట్టు కూడా పడలేదు.

తెలుగులో అయితే ఆఫర్సే రావడం లేదు. పక్క భాషల్లో చాలా సినిమాలు చేసినా.. అందులో ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. అల్మోస్ట్ కృతి పని అయిపోయింది అనే కామెంట్స్ కూడా మొదలయ్యాయి. ఇలాంటి టైమ్లో ఆమెకు దర్శకుడు అనిల్ రావిపూడి ఛాన్స్ ఇవ్వడం అంటే.. ఆమె లక్ అనే చెప్పాలి. మరోవైపు కళ్యాణ్ రామ్ కి కూడా హిట్లు లేవు. అయితే అనిల్ రావిపూడికి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది కళ్యాణ్ రామ్.. ఆ రుణం తీర్చుకునే అవకాశం ఇప్పుడు అనిల్ కి వచ్చింది అని చెప్పాలి.

దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus