Nagarjuna: ఇన్ని మల్టీస్టారర్‌లు చేస్తున్నాడు… మరి వందో సినిమా సంగతేంటి?

  • March 26, 2024 / 02:34 PM IST

నాగార్జున (Nagarjuna) వందో సినిమా ఏంటి? ఇదేం ప్రశ్న… ఎప్పుడో చెప్పేశారు కదా. జయం మోహన్‌ రాజా (Mohan Raja) దర్శకత్వంలో ఆ సినిమా ఉంటుంది అని అంటారా? అయితే ఇప్పుడు నాగార్జున నటిస్తున్న ‘కుబేర’ నెంబరు ఎంత అనేది ప్రశ్నగా మారింది. ఈ సినిమా నెంబరింగ్‌ సంగతే ఇటు తేలడం లేదు అనుకుంటుంటే మరో సినిమా ఇప్పుడ ఓకే అయ్యింది. దీంతో ఈ సినిమా నెంబర్‌ ఎంత? అనేది ఓ చర్చగా మారింది. మరోవైపు ఇప్పుడు సమాచారం వచ్చిన సినిమా కూడా మల్టీస్టారర్‌ కావడం గమనార్హం.

అవును ‘కుబేర’ సినిమా తర్వాత నాగార్జున చేస్తున్న సినిమా కూడా మల్టీస్టారరే అని అంటున్నారు. తమిళ దర్శకుడు నవీన్‌ రూపొందించనున్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్‌ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా (K. E. Gnanavel Raja) నిర్మిస్తారు. బాలీవుడ్‌ రీసెంట్ బ్లాక్‌బస్టర్ సినిమా ‘పఠాన్‌’ తరహాలో విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశాన్ని నాగార్జున కోసం నవీన్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ సినిమా గురించి నాగ్‌ ఇప్పటికే ఓ సారి మాట్లాడారు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా భారీ మల్టీస్టారర్‌ అంటున్నారు. ఈ సినిమాలో నాగార్జునతో పాటు మరో యువ హీరో ఉంటారు అని చెబుతున్నారు. దీని కోసం తమిళం, కన్నడ, హిందీ ఇండస్ట్రీలకు చెందిన హీరోల పేర్లను పరిశీలిస్తున్నట్లు భోగట్టా. ఇక ఈ సినిమా ఇద్దరు కథానాయికలు ఉంటారని మరో టాక్‌. జులై నుండి ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుందని సమాచారం. దీంతో ఈ సినిమా నెంబరు ఎంత… మరి నాగార్జున గతంలో చెప్పిన వందో సినిమా ఏమైంది అనే ప్రశ్న వినిపిస్తోంది.

ఎందుకంటే నాగార్జున వందో సినిమాలో అఖిల్‌ కూడా నటిస్తాడు అని గతంలో చెప్పారు. దీంతో తండ్రీ కొడుకుల్ని ఒకే ఫ్రేమ్‌లో చూద్దామనే కోరిక అభిమానులకు ఉండటమే దానికి కారణం. ఇప్పటికే నాగచైతన్య (Naga Chaitanya) , నాగార్జున ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన విషయం తెలిసిందే.

సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!

కర్ణాటకలో సినిమాలు బ్యాన్‌ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus